సింగపూర్ : మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ సింగపూర్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పార్టీ సింగపూర్ కమిటీ కన్వీనర్లు బొమ్మ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి , దక్కత జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిపారు. సింగపూర్లో ఉండే తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందలకుపైగా తెలుగు వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్సార్ పాలన పది తరాలకు ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ పథకాలతో పేద వారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సారి జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ పాలన తెలుగు గడ్డ మీద ఆవిష్కృతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల కోసం తామందరు సొంత ప్రాంతాలకు వెళ్లి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా మూకుమ్మడిగా వాగ్ధానం చేశారు.