ముక్కోణపు సిరీస్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లింది.
చావో, రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో యంగ్ ఇండియా ప్లేయర్స్ సత్తా చాటారు. అన్ని విభాగాల్లో రాణించి తుదిపోరుకు అర్హత సాధించారు.
ప్రారంభంలో రెండు మ్యాచ్ లు ఓడినప్పటికీ కీలక సమయంలో పుంజుకుని పాయింట్ల పట్టికలో టాప్ కు చేరింది టీమిండియా.
ఫైనల్ మ్యాచ్ లోనూ శ్రీలంకతోనే 'మెన్ ఇన్ బ్లూ' తలపడనుంది.
ముక్కోణపు సిరీస్ గెలిచి తామెంటో నిరూపించుకోవాలని యంగ్ ఇండియా పట్టుదలతో ఉంది.