పంజాబ్‌ ‘స్థానికం’లో కాంగ్రెస్‌ విజయం

24 Sep, 2018 06:39 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితులకు ఈనెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మొత్తం 355 జిల్లా పరిషత్‌ సీట్లలో కాంగ్రెస్‌ 331, శిరోమణి అకాలీదళ్‌ 18, బీజేపీ 2 దక్కించుకున్నాయి. అదేవిధంగా 2,899 పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్‌ 2,351, శిరోమణి అకాలీదళ్‌ 353, బీజేపీ 63, ఆప్‌ 20, సీపీఐ 1, సీపీఎం 2, ఇతరులు 107 గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు