టికెట్‌ ఇవ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే: దానం

11 Sep, 2018 02:46 IST|Sakshi

హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచా రం జరుగుతోందని, తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. తన నివాసం లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డిని తాను ఓ హోటల్‌లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా లో తన పేరు లేకపోవడం ఏ మాత్రం బాధించలేదన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకోసం శ్రమిస్తానని వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు