74వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

28 Jan, 2018 20:04 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 74వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. నెల్లూరు జిల్లా గూడూరు శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు పాద్రయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి  గోగినేని పురం, చెన్నూరు, వెంకటగిరి క్రాస్‌ మీదుగా పాదయాత్ర వెంకటిగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. 

అనంతరం ప్రజాసంకల్పయాత్ర  సైదాపురం మండలంలోని తూర్పు పుండ్ల క్రాస్‌ రోడ్డు నుంచి పునఃప్రారంభమవుతుంది. సైదాపురం ఎంట్రెన్స్‌ మీదుగా సైదాపురం చేరకుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. రాత్రి సైదాపురంలోనే వైఎస్‌ జగన్‌ బస చేయనున్నారు.

ముగిసిన 73వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ 73వ రోజు ప్రజాసంకల్పయాత్ర తిమ్మసముద్రం క్రాస్‌ రోడ్డు, కొండగుంట, పాలిచెర్ల, గాంధీనగర్‌, ఇందిరమ్మకాలనీ మీదుగా కొనసాగి గూడూరు శివారులో ముగిసింది. పాదయాత్రలో జననేతకు ప్రజలు నీరాజనం పలికారు. అడగడుగున ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ  వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు. 

మరిన్ని వార్తలు