ముచ్చటగా నాలుగో సారి..

29 Jun, 2018 13:22 IST|Sakshi
జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుటుంబ సమేతంగా కేసీఆర్‌ (ఫైల్‌)    

ఉద్యమ నాయకుడిగా మొదటి సారి

పార్టీ ఎన్నికల సారధిగా రెండో సారి

ముఖ్యమంత్రి హోదాలో కృష్ణా పుష్కరాలకు..

నేడు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిశీలనకు రాక  

అలంపూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గానికి ముచ్చటగా నాలుగో సారి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధిగా మొట్టమొదటి సారి కేసీఆర్‌ అలంపూర్‌ విచ్చేశారు. 2002లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పాదయాత్రను అలంపూర్‌ క్షేత్రం నుంచే మొదలు పెట్టారు. రెండో సారి 2014 ఏప్రిల్‌ 25వ తేదీన పార్టీ సారధిగా ప్రచారంలో భాగంగా అలంపూర్‌ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

అలాగే 2016 ఆగస్టు 11వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అలంపూర్‌ నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి రాత్రి అలంపూర్‌లోనే బస చేసి 12వ తేదీన గుందిమల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు.  ప్రస్తుతం రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద జరుగుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణం పరిశీలన నిమిత్తం ఆయన నాలుగో సారి రానున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు