ప్రశ్నించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి
ఎంపీలందరూ కరివేపాకులేనని వ్యాఖ్య
సాక్షి, అమరావతి: హాయిగా సినిమాలు తీసుకోకుండా పవన్ కళ్యాణ్కు రాజకీయాలు ఎందుకని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు. పవన్ రాజకీయ జీవితానికి ఆయన అన్న చిరంజీవి శాపంగా మారారని పేర్కొన్నారు. తనకు ఇక ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం లేదని, చంద్రబాబు అనుగ్రహిస్తే తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పారు. ఎంపీలందరూ కరివేపాకులేనని నిర్వేదం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉంటాయని అన్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతి ఏంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి తమ పార్టీలో చేరితో ప్రభాకర్చౌదరి కింద ఎందుకు పనిచేస్తారని, చంద్రబాబు కింద పనిచేస్తారని దివాకర్రెడ్డి చెప్పారు.