సీఎంపీపై మహాకూటమి భేటీ

3 Oct, 2018 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి నేతలు మంగళవారం మరోమారు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ పార్క్‌ హోటల్‌లో దాదాపు గంటన్నరపాటు సమావేశమైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు మహాకూటమి తరఫున రూపొందిస్తోన్న కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎం పీ)పై చర్చించారు.

ఈ భేటీకి మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీ పీ), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), దిలీప్‌కుమార్‌ (టీజేఎస్‌)లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో టీఆర్‌ఎస్‌ నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడం, రాష్ట్రంలో పౌరహక్కులను పునరుద్ధరించడంతోపాటు రైతు సమస్యలను పరిష్కరించే దిశలో ఉమ్మడి ప్రణాళిక ఉండాలని చర్చించారు. బుధవారం మరోమారు సమావేశమై సీఎంపీకి తుదిరూపునివ్వాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు