శాశ్వత పరిష్కారం కుదరదని చెప్పిన లోకేశ్..
సాక్షి, కర్నూలు : ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురంలోని పంటలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై మంత్రి లోకేశ్ను మహిళలు నిలదీశారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయనను కోరారు. అయితే, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కుదరదని, నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.