‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

26 Sep, 2019 13:29 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాప్తాడులో టీడీపీ నేతలు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులను బెదిరించి భూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో కోటీశ్వరులకు కూడా ఇళ్లు మంజూరయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని కోరారు.

ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు ఉన్నాయి. కఠిన చట్టాలు అవసరం. భూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ భూములను కాపాడాలి’ అని సూచించారు. 

చదవండి : మొసలి కన్నీరొద్దు సునీతమ్మా..

మరిన్ని వార్తలు