తమిళసినిమా: దక్షిణాదిలో నటిగా పేరు సంపాదించుకున్న వారిలో చాలా మంది తదుపరి స్టెప్గా బాలీవుడ్పై గురి పెడుతున్నారు. అలా అతిలోకసుందరి శ్రీదేవి, జయప్రదల నుంచి ఇటీవల అశిన్, శ్రియ, తాప్సీ, ఇలియానా వరకూ పలువురు నటీమణులు ఇక్కడ రాణించి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక పలువురు బాలీవుడ్ బ్యూటీస్ దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అది వేరే సంగతి. అలా తాజాగా దక్షిణాది నుంచి బాలీవుడ్ ఆఫర్ను అందుకున్న నటి నిత్యామీనన్. మాలీవుడ్కు చెందిన ఈ అమ్మడు కోలీవుడ్, టాలీవుడ్ల్లోనూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించే నటి మాత్రం కాదీ జాణ. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి వెనుకాడదు.
ఇటీవల కాస్త బరువెక్కిన నిత్యామీనన్ ప్రస్తుతం బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది. అందుకు కారణం బాలీవుడ్లో అవకాశం రావడమేననే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో స్లిమ్గా ఉండే హీరోయిన్లనే లైక్ చేస్తారు. అందుకే నిత్యామీనన్ కసరత్తులతో కొత్త అందాలను సంతరించుకునే ప్రయత్నంలో ఉందట. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ ఇచ్చిందెవరో తెలుసా? జగన్శక్తి. ఈయన అక్షయ్కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న హిందీ చిత్రంతో నిత్యామీనన్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో నిత్యతోపాటు నటి విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ నటించనున్నారట. ఇది మంగళ్యాన్ పథకం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిసింది. నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్లో సావిత్రిగా నటిస్తోంది. అదేవిధంగా తమిళంలో సైకో చిత్రంతో పాటు, తెరకెక్కిడానికి సిద్ధం అవుతున్న జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’ చిత్రంలో జయలలితగా నటించడానికి రెడీ అవుతోంది.