సాక్షి, భువనగిరి : గడువు లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడాతూ వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు స్థానమే లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారని మంత్రి తేల్చిచెప్పారు. పారదర్శకత కోసమే పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తున్నామని తెలిపారు. కొత్త చట్టంతో నీతివంతమైన పాలన అమల్లోకి వస్తుందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.