ఈ నెల 20 వరకు అభ్యర్థుల ఖరారు: ఉత్తమ్‌

9 Feb, 2019 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ బరిలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై, రాష్ట్రాల కమిటీల గురించి చర్చించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ వరకూ అభ్యర్థులను ఖరారు చేసి ఏఐసీసీకి జాబితా పంపాలని రాహుల్‌ గాంధీ ఆదేశించారన్నారు. అంతేకాక మ్యానిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలనే అంశం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. పొత్తులపై కూడా చర్చ జరిగిందని.. కానీ తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. సీనియర్‌ నేతలతో చర్చించిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు