హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి అమిత్ షా
ఆర్మూర్ ప్రచార సభ కోసం హెలికాఫ్టర్లో బయల్దేరిన షా
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం
బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్రహం
రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అబ్రహం
అలంపూర్ టికెట్ను తొలుత అబ్రహంకే ఇచ్చిన బీఆర్ఎస్
ఆ తర్వాత చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజయుడికి ఇచ్చిన బీఆర్ఎస్
హైదరాబాద్కు చేరుకున్న జాతీయ నేతలు
హైదరాబాద్కు పార్టీల అగ్రనేతలు
బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు
అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ కూడా
సాయంత్రం నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాజ్నాథ్
అగ్రనేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ స్వాగతం
శంషాబాద్కు చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా
ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన రాష్ట్ర ఇంచార్జి మాణిక్రావ్ థాక్రే
ప్రతికూల వాతావరణం కారణంగా.. రోడ్డు మార్గంలో జనగామ జిల్లా పాలకుర్తికి ప్రియాంక
పాలకుర్తి ప్రచారంలో భాగంగా.. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రియాంక
హుస్నాబాద్, కొత్తగూడెంలోనూ ప్రియాంక బహిరంగ సభలు
సాయంత్రం ఖమ్మంలోనే ఆమె బస
మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల తనిఖీలు
మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట పోలీసుల సోదాలు
హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు
మంత్రి మల్లారెడ్డికి సంజీవరెడ్డి అత్యంత సన్నిహితుడు
ఎలక్షన్ ఫ్లాయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో.. సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరుపుతున్న పోలీసులు
సంజీవరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
క్షుద్రరాజకీయాల్ని ప్రజలు గమనించాలి: రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి
అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారు.
ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా?
రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్.
కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి...
వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!
డబ్బుల పంపిణి కట్టడి చేయండి: ECI
ఎన్నికల వ్యయ పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
పాల్గొన్న తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్, డీఈవోలు
హాజరైన రాష్ట్ర వ్యాప్త 69మంది వ్యయ పరిశీలకులు
హైదరాబాద్ జిల్లా నుంచి పాల్గొన్న 8మంది ఎక్స్పెండిచర్ అబ్ జర్వర్లు
రాష్ట్ర వ్యాప్తంగా డబ్బుల పంపిణి కట్టడి పై చర్చ
డబ్బుల పంపిణి కట్టడిలో చివరి రెండు రోజులు కీలకమన్న కేంద్ర ఎన్నికల సంఘం
పదేళ్లైనా.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు
ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో జైరాం రమేష్, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం
బీఆర్ఎస్పై కాంగ్రెస్ జాతీయ నేత జైరాం రమేష్ ఫైర్
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు
రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు
అప్పుడు హైదరాబాద్లోనే పెట్టుబడులు వచ్చేవి.. ఇప్పుడు అక్కడికే వస్తున్నాయి
ప్రత్యేక రాష్ట్ర అయ్యాక తెలంగాణ ప్రజలు మేలు జరిగిందా?
పదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది
బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటే కాదు.. బ్రాండ్ తెలంగాణ సృష్టించడమే సోనియా లక్ష్యం
నిరుద్యోగుల శాతం తెలంగాణలో అధికంగా ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలులు లీక్ అవతున్నాయి
ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆత్మహత్యలుచేసుకుంటున్నారు
సామాజికన్యాయం అమలు చేయాలని సోనియా ఆకాంక్షించారు.
ఉన్నత పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయి.
బీసీ, బీసీ, దళితులకు తెలంగాణలో ఎన్ని పదవులు వచ్చాయి
ఎందుకు తెలగాణ ఏర్పాటు చేశామో.. పదేళ్ల తర్వాత కూడా ఆ లక్ష్యాలు సాధించలేదు
జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్కు కొత్త జోష్
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వబోతున్నారు
తాండూరులో ఐటీ దాడులు
యలాల మండలం జక్కేపల్లి సమీపంలోని ఆర్బీఆఎల్ ఫ్యాక్టరీపై దాడులు.
కాంగ్రెస్ అభ్యర్థి మనోహార్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డికి చెందిన ఫ్యాక్టరీ
తాండూరులో 44 లక్షల 84 వేల 500 రూపాయలు పట్టివేత
కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
డబ్బులు తరలిస్తున్న ఓ పత్రికకు చెందిన స్థానిక రిపోర్టర్ను చారిస్తున్న పోలీసులు
ఆరు గ్యారంటీలతో కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుంది: భట్టి
ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నమ్మొద్దు అని కేసీఆర్ అంటున్నారు.
ఆరు గ్యారంటీలతో ప్రజల సంపద ప్రజల పంచాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం.
ప్రజల సంపద ప్రజలకు పంచాలా? పాలకులు పంచుకుని తినాలా? ఎందుకు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు?
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు నమ్మొద్దు, నమ్మొద్దు అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంటి? మళ్లీ ఐదు సంవత్సరాలు మేమే పంచుకు తింటామని చెప్పడమా?
కాంగ్రెస్ ఉంటనే కరెంటు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ల వల్ల ఉత్పత్తి అవుతున్న కరెంటుతో నేడు కొరతలేదు.
కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్.
కరెంటు ఉత్పత్తి ఎలా చేయాలి? నాణ్యమైన కరెంటును ఉత్పత్తి చేసి రైతులకు ఎలా సరఫరా చేయాలన్నది కాంగ్రెస్కు పాలన అనుభవం ఉంది.
రెండు రోజుల పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రియాంక గాంధీ సభలను విజయవంతం చేయాలని పిలుపు.
ఎన్నికలపై తుఫాను ఎఫెక్ట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వర్షం ఆటంకం
26న వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ
28వ తేదీ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం
ఇప్పటికే.. హైదరాబాద్లో బీఆర్ఎస్ సభ రద్దు
మిగతా పార్టీల సభల షెడ్యూల్లోనూ మార్పులు చేసుకునే అవకాశం
జనసమీకరణ కష్టం అవుతుందని పార్టీల దిగులు
తెలంగాణ ప్రచారంలో డీకేఎస్ బిజీబిజీ
నేడు రేపు నల్లగొండలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారం
ఎల్లుండి కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో
అంబర్పేటలో ప్రచారంలో పాల్గొననున్న డీకే శివకుమార్
జోగులాంబలో ఉద్రిక్తత
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఉద్రిక్తత
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల
మాల వేసే క్రమంలో విరిగిన విగ్రహం వేలు
ప్రచార రథాన్ని అడ్డుకుని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు
పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్త వాతావరణం
పువ్వాడపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్
ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్కు సపోర్ట్ చేయదు అనే అపోహ ఉంది
పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్కు సీపీఐ సపోర్ట్ చేస్తుందనే అపవాదు సృష్టిస్తున్నారు
అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి తో చెక్ పెట్టాలి
అజయ్కు సపోర్ట్ చేస్తే సీపీఐ లోని ఎంత పెద్ద నేత ఉన్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం
తులసి వనంలో గంజాయి మొక్కలాంటోడు పువ్వాడ అజయ్ కుమార్
తండ్రికి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్
అటువంటి వ్యక్తి కి cpi మద్దతు ఇవ్వదు
జిల్లాలో పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయ్ నే
తెలంగాణ పవర్ బీఆర్ఎస్దే: రాజ్నీతి సర్వే
రాజ్నీతి సర్వేలో బీఆర్ఎస్కే పట్టం
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 38,351 మంది.. మొత్తం తొమ్మిది వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
రైతులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు/ఆటోడ్రైవర్లు, పక్కా ఇళ్ల యజమానులు, ఇతరులు
సర్వేలో పాల్గొన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వాళ్లు
బీఆర్ఎస్కు 75 స్థానాలు.. 42.43 శాతం ఓట్లు
కాంగ్రెస్కు 31 స్థానాలు.. 32. 62 శాతం ఓట్లు
ఎంఐఎంకు ఏడు
బీజేపీకి ఐదు స్థానాలు.. 16.71 శాతం ఓటింగ్ మాత్రమే
మూడోసారి బీఆర్ఎస్కే పట్టమని రాజ్నీతి రిపోర్ట్
రేపటి కేసీఆర్ సభ రద్దు
హైదరాబాద్లో శనివారం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
పరేడ్ గ్రౌండ్స్లో సభకు హాజరుకావాల్సిన అధినేత కేసీఆర్
వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్
ఆ మూడు ఒక్కటే.. ఎలిమినేట్ చేయాలి: నారాయణ
ఖమ్మంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం
కాంగ్రెస్, సీపీఐ కు ఓటేస్తే బిజెపి, బీఆర్ ఎస్ ,ఏంఐఎం మూడు పార్టీలు ఎలిమినెట్ అవుతాయి
బిజెపి, బీఆర్ ఎస్, ఏంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఒప్పందం లో భాగంగానే ముందుకు వెళుతున్నాయి
గోషామాల్ లో బిజెపి నుంచి రాజాసింగ్ పోటీ చేసే చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టలేదు.. కానీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట ఏంఐఎం అభ్యర్థి ని నిలబెట్టింది.
ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి!
పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు చేసేవాన్ని డ్రామాలే
కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి
కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లనే తెలంగాణ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది
కాంగ్రెస్ వాళ్లు ముదుర్లు.. ఐదు సీట్లు అడిగితే ఒక్కటి ఇచ్చారు
అవినీతి ఆరోపణలపై స్పందించాలి:హైకోర్టు ఆదేశం
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, ఎంపీ అర్విద్ సహా ఇతర పార్టీల నేతల ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై విచారణ జరపాలని సమర్పిచిన వినతిపత్రాలను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీని ఆదేశించిన హైకోర్టు
ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ఒక పార్టీ వారిపై మరొకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని, నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని.. వీటిపై విచారణ జరిపేలా ఈసీ, అధికారులను ఆదేశించాలని కోరుతూ నిజామాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ఖాదర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు.
ఈ నెల 2న డీజీపీ, 4న సీఈవోకు ఈ అంశంపై వినతిపత్రం సమర్పించానని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క
నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.
నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసు. కానీ, నేను వారి పార్టీ పేరు వెల్లడించను.
ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయను.
‘నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.
నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు.
అయినా నేను దేనికీ భయపడను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది.
హైకోర్టులో బర్రెలక్క పిటిషన్పై నేడు విచారణ
గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్2 గన్మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్ దాఖలు
నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటన
ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం.. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగం
తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గాల పరిధిలో అమిత్షా రోడ్ షో
25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గాల బహిరంగ సభల్లో ప్రసంగం
సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొననున్న అమిత్షా
26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగం
అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న అమిత్షా
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం