80 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన

13 Nov, 2018 01:28 IST|Sakshi

హైదరాబాద్‌: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌.మురారి 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

తాము ప్రకటించిన అభ్యర్థులకు ఇప్పటికే బీ–ఫారాలు ఇచ్చామని, ఈ నెల 14న వారు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. నిజామాబాద్‌ బోధన్‌ నుంచి మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ప్రేమ్‌ గాంధీ, రాజేం ద్రనగర్‌ అభ్యర్థి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు