సాక్షి, నూజివీడు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి సోమవారం ఉదయం వైఎస్ జగన్ ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు జననేత వెంట అడుగులు వేస్తున్నారు. అనంతరం వైఎస్ జగన్ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గొల్లన్నపల్లి, చిక్కవరం క్రాస్ మీదుగా గోపవరపు గూడెంకు చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బసచేస్తారు. ఇప్పటివరకు జగన్ 1842.3 కిలోమీటర్లు నడిచారు.