మన్యం మదిలో వైఎస్‌ జగన్‌

23 May, 2019 21:17 IST|Sakshi

 ఏపీలోని అన్ని గిరిజన నియోజకవర్గా‍ల్లో వైఎస్సార్‌ సీపీ విజయకేతనం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు గిరిజన నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలను గిరిజనులు నమ్మలేదు. ఈ ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న భాదలకు ఓటు రూపంలో బాబుకు గట్టి సమాధానం చెప్పారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన ఈ స్థానాల్లో పార్టీ ఫిరాయించిన మూడు నియోజకవర్గాలు ఉండడం విశేషం. ప్రలోభాలకు లొంగి ఎ‍మ్మెల్యేలు పార్టీ మారినా గిరిపుత్రులు మాత్రం వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. వైఎస్సార్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ తమ ఓటును ప్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి అండగా నిలిచారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించే వేదికగా ఉండాల్సిన గిరిజన సలహా మండలిని సైతం ఏర్పాటు చేయకపోవడం టీడీపీ ఓటమికి ప్రధాన కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల లాగానే ఈ సారి కూడా గిరిజనులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే నమ్మారు.

మరిన్ని వార్తలు