పింఛన్‌ మంజూరు చేయలేదు

11 Feb, 2018 07:04 IST|Sakshi

అల్లూరు: ‘అన్నా.. కూలీ పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగి కుడి చేయి కోల్పోయా. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇలా జరిగింది. ఈ క్రమంలో వికలాంగ పింఛన్‌ మంజూరు చేయమని వినతిపత్రం అందజేశా. రేపు, మాపు అంటున్నారు కానీ పింఛన్‌ మాత్రం మంజూరు చేయడం లేదు’ అంటూ బోగోలు మండలం జక్కేపల్లిగూడూరుకు చెందిన పులివెందుల ప్రవీణ్‌కుమార్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యాబిడ్డలతో దగదర్తి వద్ద జననేతను కలిసిన ప్రవీణ్‌ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయాడు. వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ మరో ఏడాదిలో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు తప్పకుండా పింఛను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు