సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 76వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. బుధవారం ఉదయం ఆయన కలిచేడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి మలిచేడు క్రాస్, బేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం...పాదయాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు.
కలిచేడు వరకూ కొనసాగిన పాదయాత్ర
వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం కలిచేడు వద్ద 75వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఇవాళ మొత్తం ఆయన 14.9 కిలోమీటర్లు నడిచారు. సిద్ధలయ్యకోన, పోకందుల క్రాస్, ఊటుకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెర్ల మీదగా కొలిచేడు వరకూ యాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1019.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.