మూడో టెస్టు: 200పైగా ఆధిక్యంలో ఆసీస్

29 Dec, 2014 10:26 IST|Sakshi

మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్గా 200పైగా పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. రోజర్స్, మార్ష్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు అశ్విన్,ఇషాంత్,  ఉమేష్ తలా వికెట్ తీశారు.

 462/8 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు