గెలుచుకున్నదంతా కార్చిచ్చు బాధితులకే

6 Jan, 2020 10:34 IST|Sakshi

బ్రిస్బేన్‌ టెన్నిస్‌ టోర్నీ ఆడటం ద్వారా తనకు రానున్న మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకే అందజేస్తానని ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ  ప్రకటించింది. ఆసీస్‌కు చెందిన ఈ 23 ఏళ్ల క్రీడాకారిణి గత నవంబర్‌లో ‘జంతువులపై క్రూరత్వ నివారణ’కు పాటుపడుతోన్న రాయల్‌ సొసైటీకి 30 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు అందజేశానని తెలిపింది.

తాజాగా ఆస్ట్రేలియాను చుట్టుముట్టిన దావానలం బాధితుల కోసం రెడ్‌క్రాస్‌కు మరింత ఎక్కువగా విరాళమివ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. నేటి నుంచి ఈనెల 12 వరకు జరుగనున్న ఈ టోర్నీ ఆడటం ద్వారా దాదాపు 2,50,000 అమెరికా డాలర్లు (రూ. కోటీ 79 లక్షలు) ఆమె రెడ్‌క్రాస్‌కు ఇచ్చే వీలుంది. 
 

మరిన్ని వార్తలు