లంకతో రెండో వన్డే: ధావన్‌ హాఫ్‌ సెంచరీ

13 Dec, 2017 12:40 IST|Sakshi

15 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 75/0

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ అర్ధ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్‌లో 23 హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్‌(23) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్‌ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఇక తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ధావన్‌ ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లను ఓ​ ఆటాడుకున్నాడు.  ప్రదీప్‌ వేసిన 13 ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నాడు. తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం పరుగుల వేగాన్ని పెంచింది.

>
మరిన్ని వార్తలు