భారత మహిళలకు మరో ఓటమి

6 Apr, 2016 00:06 IST|Sakshi

హాస్టింగ్స్: న్యూజిలాండ్‌లో జరుగుతోన్న హాక్స్‌బే కప్ టోర్నమెంట్‌లో భారత మహిళల హాకి జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ 1-2తేడాతో చైనా చేతిలో ఓడిపోయింది. తొలుత చైనా కన్నా ముందే 19వ నిమిషంలో రాణి చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ 1-0 ఆధిక్యాన్ని నిలుపుకోలేకపోయింది. వెంటనే చైనా క్రీడాకారిణి యూ కియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే చివరి క్వార్టర్‌లో వాంగ్ మెంగ్‌యూ(85వ ని.) గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. దీనికి ముందు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

మరిన్ని వార్తలు