సర్దార్ సింగ్‌కు ఊరట

15 Oct, 2016 10:53 IST|Sakshi
సర్దార్ సింగ్‌కు ఊరట

న్యూఢిల్లీ: మాజీ ప్రేమికురాలిపై అత్యాచారం కేసులో హాకీ ఆటగాడు సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విచారణ కోసం సిటీ ట్రయల్ కోర్టు ఆదేశించిందని, దీనిపై స్టే విధించాలని సర్దార్ హైకోర్టును ఆశ్రయించాడు. సర్దార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఇంగ్లండ్‌కు చెందిన మాజీ అండర్-19 హాకీ పేయ్లర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
 అయితే అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు వేసింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించగా హైకోర్టు స్టే విధిస్తూ జనవరి 6లోగా ఈ విషయంపై సమాధానమివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులిచ్చింది.
 
 
 

మరిన్ని వార్తలు