భారత్ పరాజయం

12 Dec, 2016 15:24 IST|Sakshi

పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఓటమితో ఆరంభించింది. సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ విభాగంలో భారత్ 0-3తో టాప్ సీడ్ ఈజిప్ట్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నౌర్ ఎల్ షౌర్బిని చేతిలో భారత స్టార్ జోష్న చినప్ప 5-11, 6-11, 13-15తో ఓడింది. ఇక దీపికా పళ్లికల్ కాస్త పోరాడినా 11-4, 7-11, 4-11, 9-11తో నౌరన్ గోహర్ చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో సునయన కురువిల్లా 7-11, 7-11, 2-11తో అబ్దెల్ చేతిలో చిత్తుగా ఓడింది. నేడు (మంగళవారం) జరిగే మ్యాచ్‌లో మెక్సికోతో భారత్ తలపడుతుంది. 

 

మరిన్ని వార్తలు