భారత్‌(vs)అర్జెంటీనా 

3 Mar, 2018 01:11 IST|Sakshi

ఇఫో(మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో ఈసారీ పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగుతోంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అర్జెంటీనాతో భారత్‌ తలపడుతుంది. గతంలో సర్దార్‌ సింగ్‌ నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడిన మూడుసార్లూ భారత్‌ పతకంతో తిరిగి వచ్చింది.

2008లో సర్దార్‌ కెప్టెన్సీలో టీమిండియా రజతం... 2015లో కాంస్యం, 2016లో రజతం గెలు పొందింది. భారత్‌తోపా టు అర్జెంటీనా, మలేసియా, ఆస్ట్రేలియా, ఇంగ్లం డ్, ఐర్లాండ్‌ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. 

మరిన్ని వార్తలు