20 బంగారు పతకాలతో అగ్రస్థానం

7 May, 2018 05:09 IST|Sakshi

కొలంబో: మొదటి రోజు 11 స్వర్ణాలతో మెరిసిన అథ్లెట్లు రెండో రోజు 9 బంగారు పతకాలతో సత్తా చాటడంతో దక్షిణాసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అగ్రస్థానాన నిలిచింది. ఏడు దేశాలు తలపడిన ఈ మీట్‌ ఆదివారంతో ముగిసింది. మొత్తం 20 స్వర్ణాలు, 22 రజతాలు, 8 కాంస్యాలతో భారత్‌ పతకాల పట్టికలో మొదటి స్థానం దక్కించుకుంది. 12 స్వర్ణాలు, 10 రజతాలు, 19 కాంస్యాలతో ఆతిథ్య శ్రీలంక ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులు జపాన్‌లోని జిఫులో వచ్చే నెల 7 నుంచి 10 వరకు నిర్వహించే  ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

మరిన్ని వార్తలు