హైదరాబాద్‌లో ప్లే ఆఫ్‌ మ్యాచ్‌!

8 Apr, 2019 03:35 IST|Sakshi

నేడు నిర్ణయం

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసేందుకు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేడు సమావేశం కానుంది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరగనుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల (రెండు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ మ్యా చ్‌) వేదికలుగా హైదరాబాద్, చెన్నై ఖరారయ్యే అవకాశం ఉంది. ముంబైలో ఫైనల్‌ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీసీసీఐ మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌గా పేటీఎం గడువు ముగిసిపోయింది. దాంతో కొత్త స్పాన్సర్‌ కోసం టెండర్లను కోరే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మహిళా క్రికెటర్లతో మినీ ఐపీఎల్‌ నిర్వహించడంపై కూడా చర్చ జరగవచ్చు.   

>
మరిన్ని వార్తలు