జతిన్‌దేవ్, కావ్యలకు టైటిళ్లు

12 Nov, 2018 10:02 IST|Sakshi

రాష్ట్ర స్థాయి టీటీ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో కావ్య (ఏడబ్ల్యూఏ), జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) విజేతలుగా నిలిచారు. వ్యాసపురి బండ్లగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్‌ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్‌ బాలుర ఫైనల్లో జతిన్‌దేవ్‌ 3–0తో పార్థ్‌ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా, బాలికల తుది పోరులో కావ్య 3–1తో నిఖిత (వీపీజీ)ని ఓడించింది. సబ్‌ జూనియర్‌ బాలుర విభాగంలో కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌), ఎస్‌ఎస్‌కే కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో కేశవన్‌ 4–0తో క్రిష్‌ సింఘ్వీ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్‌ 4–0తో ప్రణవ్‌ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు.

బాలికల సెమీస్‌లో భవిత (జీఎస్‌ఎం) 4–0తో నిఖిత (వీపీజీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు జూనియర్‌ బాలుర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ) 4–1తో యశస్విన్‌ (జీఎస్‌ఎం)పై, అమన్‌ (ఏవీఎస్‌సీ) 4–0తో వత్సిన్‌ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్‌ 4–1తో అద్వైత్‌ (ఏడబ్ల్యూఏ)పై, కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 4–1తో సాయినాథ్‌రెడ్డి (ఎంఎల్‌ఆర్‌)పై గెలిచారు. బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ) 4–1తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, అంజలి (జీఎస్‌ఎం) 4–1తో రమ్యపై, భవిత (జీఎస్‌ఎం) 4–0తో విధి (జీఎస్‌ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. యూత్‌ బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) 4–3తో నైనాపై, శ్రీజ (ఎంఎల్‌ఆర్‌) 4–0తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టారు. 

మరిన్ని వార్తలు