భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ

27 Aug, 2017 12:52 IST|Sakshi
భారత పారా సైక్లింగ్‌ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సైక్లింగ్‌ సంఘం కార్యదర్శి కె. దత్తాత్రేయ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన పారా సైక్లింగ్‌ రోడ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. దత్తాత్రేయతో పాటు ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు ఆదిత్య మెహతా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఈనెల 31 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది.

 

మరిన్ని వార్తలు