విశాఖ చేరుకున్న కోహ్లి

29 Sep, 2019 15:03 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(ఫైల్‌ఫొటో)

విశాఖ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి ఆరంభం కానున్న తరుణంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశాఖకు చేరుకున్నాడు. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా తదితరులు విశాఖలో అడుగుపెట్టారు.  ముంబై నుంచి ఇండిగో విమానంలో నగరానికి చేరుకున్న వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గత వారమే దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడికి చేరుకోగా, భారత జట్టులోని సభ్యులు విడతల వారీగా నగరానికి చేరుకుంటున్నారు.

అక్టోబర్‌2వ తేదీ నుండి భారత-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఇక్కడ ఒక టెస్టు మ్యాచ్‌ జరిగింది. 2016-17 సీజన్‌లో కోహ్లి నేతృత్వంలో భారత జట్టు.. ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఇందులో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 167 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు