షాహిద్ ఆఫ్రిదికి పాకిస్థాన్ జట్టు నుంచి మళ్లీ పిలుపు

4 Jul, 2013 06:22 IST|Sakshi
షాహిద్ ఆఫ్రిదికి పాకిస్థాన్ జట్టు నుంచి మళ్లీ పిలుపు

 కరాచీ: డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి పాకిస్థాన్ జట్టు నుంచి మళ్లీ పిలుపు అందింది. ఈ నెల 14 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు దక్కింది.
 
 ఇరుజట్లు ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టి20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే చాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్, ఇమ్రాన్ ఫర్హాత్‌లపై వేటు పడింది. ఉమర్ అక్మల్‌తో పాటు ఓపెనర్ అహ్మద్ షెహజాద్, ఆల్‌రౌండర్ సొహైల్ తన్వీర్, హమద్ అజమ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. 2015 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు పునర్నిర్మాణం చేస్తున్నామని చీఫ్ సెలక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ అన్నారు.
 

మరిన్ని వార్తలు