రుత్వికకు టైటిల్

15 Dec, 2014 00:49 IST|Sakshi
రుత్వికకు టైటిల్

టాటా ఓపెన్ బ్యాడ్మింటన్
 ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రుత్విక 19-21, 21-18, 21-14తో అరుంధతి పంతవానేపై గెలిచింది.
 
  పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో గురుసాయిదత్ 16-21, 22-20, 17-21తో హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ 21-13, 10-21, 21-13తో మేఘన-మనీషాపై; మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-19, 19-21, 21-10తో అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యా గాద్రెపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి 21-15, 21-15తో శ్లోక్ రామచంద్రన్-సంయమ్ శుక్లాపై నెగ్గారు.

మరిన్ని వార్తలు