మలేసియా ఓపెన్ ‌: సైనా ఓటమి

19 Jan, 2019 14:12 IST|Sakshi

కౌలాలంపూర్‌ : మలేసియా మాస్టర్స్‌ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కథ ముగిసింది. ప్రపంచ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌  సెమీ  ఫైనల్లో  సైనా 16-21, 13–21తో పరాజయం పాలైంది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మారిన్‌ జోరు ముందు సైనా చేతులెత్తేసింది.

తొలి గేమ్‌లో 14-14తో మారిన్‌కు గట్టిపోటీనిచ్చిన భారత స్టార్‌ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సైనా-మారిన్‌ల ముఖాముఖీ రికార్డు 5-6గా మారింది. ఈ మ్యాచ్‌ అనంతరం సైనా.. మారిన్‌కు అభినందనలు తెలపుతూ ట్వీట్‌ చేసింది.‘ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అద్భుతంగా ఆడిన మారిన్‌కు అభినందనలు.. వచ్చే వారం జరిగే ఇండోనేషియా ఓపెన్‌లో రాణిస్తాను’. అని పేర్కొంటూ సైనా ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు