పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

17 Jul, 2019 20:49 IST|Sakshi

అంటిగ్వా : సారథి మనీశ్‌ పాండే సెంచరీతో పాటు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్‌-ఏతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా-ఏ 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. 

టీమిండియా ఆటగాళ్లలో మనీష్‌ పాండే(100; 87 బంతుల్లో) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్‌ గిల్‌(77), శ్రేయాస్‌ అయ్యర్‌(47)లు రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా కృనాల్‌ పాండ్యా(5/25) నిప్పులు చెరగడంతో విండీస్‌ కనీసం 150 పరుగులు కూడా దాటలేకపోయింది. కరేబియన్‌ ఆటగాళ్లలో క్యాంప్‌బెల్‌(21), సునీల్‌ అంబ్రిస్‌(30) మినహా ఎవరూ రాణించలేకపోయారు. 

మరిన్ని వార్తలు