పోలీసులు దాడి: 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

13 Oct, 2016 06:53 IST|Sakshi

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పేకాట నిర్వాహకుడి అశోక్తోపాటు 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడికి ఏఎస్పీ నేతృత్వం వహించారు.

మరిన్ని వార్తలు