కారుబోల్తా: ముగ్గురు మృతి

28 Apr, 2017 15:15 IST|Sakshi
మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తొర్రూర్‌ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తొర్రూరు మండలం పటేల్ గూడెంనకు చెందిన బాపు రెడ్డి (35), మునీందర్‌ (25), శ్రీకాంత్‌(20) అనే వారు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను తొర్రూర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు