తాగిన మైకంలో హుచ్చ వెంకట్‌ వీరంగం

7 Sep, 2018 11:50 IST|Sakshi

యశవంతపుర : తాగిన మైకంలో హుచ్చ వెంకట్‌ వీరంగం సృష్టించిన ఘటన రాజ రాజేశ్వరినగరలో చోటు చేసుకొంది. గురువారం ఉదయం నిద్రలేచి సమీపంలోని ఓ బేకరివద్దకు హుచ్చవెంకట్‌ వెళ్లాడు. ఏమి మాట్లాడకుండానే దుకాణం వద్ద ఉన్నవారిపై కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్‌ కనిపించకుండా పోయాడు. 

మరిన్ని వార్తలు