కైపులో.. రాత్రంతా చెత్తకుండీలో

26 Dec, 2019 11:36 IST|Sakshi
చెత్త కుండీ నుంచి బయటకు వచ్చిన కాలు, ఆ వ్యక్తి దృశ్యాలు

మైసూరు: మద్యం మత్తులో చెత్తకుండీలో పడిపోయి రాత్రంతా అందులోని పడుకున్న వ్యక్తిని బుధవారం పారిశుధ్య కార్మికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. డీడి మొహల్లాలోని ఓ చెత్తకుండీని లారీలో ఎక్కించడానికి కార్మికులు ప్రయత్నిస్తున్న సమయంలో చెత్తకుండీలో నుంచి వ్యక్తి కాలు బయటకు రావడాన్ని చూసి భయపడ్డారు. నిదానంగా చెత్తను మొత్తం తొలగించి చూడగా అందులో వ్యక్తి అచేతనంగా పడి ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మద్యం కైపులో అతడు చెత్తకుండీ లోపలికి పడిపోయాడు. జనం అలాగే చెత్త వేశారు. ఎలాగో ఊపిరి ఆడడంతో ప్రాణాలు మిగిలే ఉన్నాయి.  

మరిన్ని వార్తలు