కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ

1 Nov, 2016 13:49 IST|Sakshi
కేటీఆర్ రాజీనామా చేయాలి: మధుయాష్కీ
జీహెచ్ఎంసీ కుంభకోణంలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ డిమాండ్ చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. 
 
తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే.. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. దోచుకోవడంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నెంబర్ వన్ స్థానాల్లో నిలిచాయని విమర్శించారు. 
మరిన్ని వార్తలు