రాష్ట్రంలో ‘సింటెక్స్‌’ పెట్టుబడి రూ.350 కోట్లు

24 Sep, 2023 03:07 IST|Sakshi

ఈనెల 28న శంకుస్థాపనకు కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వెల్‌స్పన్‌ గ్రూపు కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న ‘సింటెక్స్‌’ హైద­రాబాద్‌లో రూ.350 కోట్ల పెట్టుబడితో త­యా­రీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తు­న్న­ట్లు ప్రక­టించింది. వాటర్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ పైపులు, ఆటో కాం­­­పొ­నెంట్స్, ఇతర పరికరా­లను తయా­రుచేసే ఈ యూనిట్‌ ద్వారా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటు­లోకి వస్తా­యి. వెల్‌స్పన్‌ ఇప్పటికే కార్యకలా­పాలు నిర్వహి­స్తు­న్న చందన్‌వెల్లిలోనే సింటెక్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటవుతుంది.

ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్య­క్రమా­నికి రాష్ట్రఐటీ, పరిశ్ర­మలశాఖ మంత్రి కేటీ రామారా­వుతో పా­టు వెల్‌స్పన్‌ కంపెనీ చైర్మన్‌ బీకే గో­యెంకా హాజర­వుతారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో భారీగా పెట్టుబడుల­తో కార్యక­లా­పాలు నిర్వహిసు­న్న వెల్‌స్పన్‌ గ్రూప్‌ రాష్ట్రంలో మరింత విస్తరించనుండటం పట్ల కేటీ­ఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అందుబాటు­లోని మౌలిక వస­తుల వ­ల­న అనేక నూతన పెట్టుబ­డులు రా­ష్ట్రా­నికి తరలివస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు