వెంకటాపురం: భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం(నుగూరు) మండల పరిధిలోని పాలేం వాగు సమీపంలో శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోలు అమర్చిన మందుపాతరను గుర్తించారు. ప్రాజెక్ట్ సమీపంలోని కొప్పుగుట్ట వద్ద మావోలు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు.