ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఇద్దరి మృతి

6 Oct, 2016 07:16 IST|Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని కేతెపల్లి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

మరిన్ని వార్తలు