కరెంట్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి

14 Apr, 2015 14:42 IST|Sakshi

హైదరాబాద్: నాలా శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మియాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కరెంట్ తీగలు తెగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
(మియాపూర్)

మరిన్ని వార్తలు