ఉపాధి హామీ కింద కొత్తగా 95 పనులు

14 Jan, 2020 04:15 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి హామీ పథకం కింద కొత్తగా 95 పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పనులకు ఆదనంగా ఈ ఏడాది నుంచి ఈజీఎస్‌ కింద ఈ పనులను చేపట్టనుంది. ఈ మేరకు కొత్తగా గుర్తించిన పనులు, అంచనా వ్యయం, వేతనం, సామగ్రి, పనిదినాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా పనుల్లో వినియోగించాల్సిన సామగ్రి, వేతనం, పనిదినాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చారు.

మరిన్ని వార్తలు