బీసీలకు 50 శాతం డబుల్‌ బెడ్రూం ఇళ్లు

29 Oct, 2017 01:50 IST|Sakshi

కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకంలో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం వాటా ఇవ్వాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దామాషా ప్రకారం ఇస్తుండగా.. బీసీలకూఅదే నిబంధన వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించి సాధించుకుంటామన్నారు.    

మరిన్ని వార్తలు