ఎముకల ఫ్యాక్టరీని మూసివేయాలి

8 May, 2018 10:30 IST|Sakshi
జేసీకి వినతిపత్రం అందజేస్తున్ననాయకులు  

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య డిమాండ్‌

జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు

అనంతగిరి : పూడూరు మండలం మేడికొండ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎముకల ఫ్యాక్టరీని మూసివేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అద్యక్షుడు కోళ్ల యాదయ్య, టీజేఎస్‌ జిల్లా నాయకుడు నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం  జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు హానీ చేసే ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని కోరారు.

ఎముకల ఫ్యాక్టరీతో  ప్రజలు తీవ్ర ఆనారోగ్యనికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో అస్వస్థతకు గురై పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గతంలో ఈ ఫ్యాక్టరీపై అధికారులు చర్యలు తీసుకుని మూసివేసిన తర్వాత తిరిగి నడుస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వసంత్‌కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆనంద్, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

మరిన్ని వార్తలు