ఇంటర్‌ బోర్డు తీరుపై మండిపడ్డ జగ్గారెడ్డి

23 Apr, 2019 12:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ రంగప్రవేశం చేసి గంటల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు