సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 99 కరోనా కేసులు నమోదు కాగా, మరో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, 12 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 1,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 92 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,273 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 70, రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్నగర్ జిల్లాలో 1, మేడ్చల్ జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 నమోదయ్యాయి.