చేపల వలలో మొసలి..

19 Jan, 2016 19:51 IST|Sakshi

కొల్పారం (మెదక్) : చేపల వేటకు వెళ్లిన జాలర్లు చేపల కోసం వల వేస్తే.. అందులో మొసలి ప్రత్యక్షమైన సంఘటన మెదక్ జిల్లా కొల్పారం మండలం ఘన్‌పూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానిక ఆనకట్టలో చేపలు పడుతున్న జాలర్లు వలలో చిక్కిన మొసలిని గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని మంజీరా అభయారణ్యానికి తరలించారు.

మరిన్ని వార్తలు